Automobile Short News

మళ్లీ పేదవాడి బండికే పట్టం కట్టిన జనాలు

మళ్లీ పేదవాడి బండికే పట్టం కట్టిన జనాలు

భారతదేశంలో టూ-వీలర్ వాహనాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా విడుదలైన మే 2026 నాటి దేశీయ వాహనాల అమ్మకాల గణాంకాలు ఈ విషయాన్ని మరోసారి నిరూపించాయి. ఈ నెలలో కూడా ఎప్పటిలాగే మధ్యతరగతి ప్రజల ఆశాజ్యోతి హీరో స్ప్లెండర్ (Hero Splendor) అమ్మకాల్లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
మీ వాహనం రీసేల్ విలువ పెరగాలా? ఈ సింపుల్ అలవాట్లు ఫాలో అయితే చాలు!

మీ వాహనం రీసేల్ విలువ పెరగాలా? ఈ సింపుల్ అలవాట్లు ఫాలో అయితే చాలు!

Car Maintenance Tips: మీ కారు రీసేల్ విలువను పెంచుకోవడానికి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం, డ్రైవింగ్ అలవాట్లను మార్చుకోవడం మరియు పత్రాలను భద్రపరుచుకోవడం వంటి సులభమైన చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.
చిన్న కారు.. పెద్ద రేంజ్.. MG నుంచి 500 కి.మీ వెళ్లే EV రాబోతోంది!

చిన్న కారు.. పెద్ద రేంజ్.. MG నుంచి 500 కి.మీ వెళ్లే EV రాబోతోంది!

భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రముఖ బ్రిటిష్ ఆటోమొబైల్ తయారీ సంస్థ ఎంజీ మోటార్ (Mg Motor) మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే కామెట్ EV, విండ్సర్ EV వంటి మోడళ్లతో దేశీయ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ, ఇప్పుడు మరింత సరసమైన ధరలో ఒక కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఈ కొత్త మోడల్ త్వరలోనే భారత మార్కెట్లో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లలో వులింగ్ బింగువో (Binguo) పేరుతో విక్రయించబడుతున్న ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఇటీవల భారతీయ రోడ్లపై పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో కనిపించింది.
కారు కొనే ప్లాన్ ఉందా? అయితే ఈ నెలాఖరు వరకే ఛాన్స్

కారు కొనే ప్లాన్ ఉందా? అయితే ఈ నెలాఖరు వరకే ఛాన్స్

సొంత కారు కొనాలని ప్లాన్ చేస్తున్న మధ్య తరగతి, ప్రీమియం కస్టమర్లకు ప్రముఖ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) గట్టి జలక్ ఇచ్చింది. తన వాహన శ్రేణి అంతటా ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వచ్చే నెల, అంటే జూలై 1, 2026 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. వాహనాల తయారీకి అయ్యే ముడిసరుకుల ధరలు (Commodity Prices), ఇతర ఇన్పుట్ ఖర్చులు విపరీతంగా పెరగడం వల్లే ఈ భారాన్ని ఆంశికంగా కస్టమర్లపై వేయక తప్పడం లేదని కంపెనీ స్పష్టం చేసింది.